Header Banner

rbi: ఏటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్..! విరివిగా అందుబాటులోకి 100, 200 నోట్లు..!

  Tue Jun 17, 2025 12:03        Others

దేశంలోని ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లలో (ఏటీఎం) చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్ల లభ్యతను పెంచాలన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆదేశాల అమలులో బ్యాంకులు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఆర్‌బీఐ నిర్దేశించిన సెప్టెంబర్ 30 గడువుకు మూడు నెలల ముందే దేశంలోని 73 శాతం ఏటీఎంలు ఇప్పుడు రూ.100 లేదా రూ.200 నోట్లను కనీసం ఒక క్యాసెట్ నుంచి జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది.

దేశంలోనే అతిపెద్ద నగదు నిర్వహణ సంస్థ అయిన సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఈ గణాంకాలను వెల్లడించింది. ఈ సంస్థ దేశంలోని మొత్తం 2,15,000 ఏటీఎంలలో 73,000 ఏటీఎంలను నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబర్ 2024లో 65 శాతంగా ఉన్న ఈ చిన్న నోట్ల లభ్యత ప్రస్తుతం 73 శాతానికి పెరిగినట్టు ఆ సంస్థ తెలిపింది.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..


"దేశంలో ఇప్పటికీ 60 శాతం వినియోగదారుల ఖర్చులు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ లావాదేవీల అవసరాలను తీర్చడంలో రూ.100, రూ.200 నోట్ల లభ్యత నేరుగా ఉపయోగపడుతుంది" అని సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ క్యాష్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెంట్ అనుష్ రాఘవన్ పేర్కొన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో ఆర్‌బీఐ జారీచేసిన సర్క్యులర్ ప్రకారం అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30 నాటికి తమ ఏటీఎంలలో కనీసం 75 శాతం వాటిల్లో రూ. 100 లేదా రూ.200 నోట్లను కనీసం ఒక క్యాసెట్ నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. రోజువారీ లావాదేవీలకు విస్తృతంగా ఉపయోగించే చిన్న డినామినేషన్ నోట్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడమే కేంద్ర బ్యాంకు లక్ష్యం. ఈ నిబంధనను 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలకు వర్తింపజేయాలని కూడా ఆర్‌బీఐ పేర్కొంది. 

ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RBIUpdate #ATMUsers #100RupeesNotes #200RupeesNotes #CashAvailability #GoodNewsFromRBI #BankingNews